YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ఈ రోజు మేడారంలోని వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివాసీ పూజారులు వైయస్ షర్మిల గారికి ఘన స్వాగతం పలికారు. సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, వారి సంస్కృతి, సంప్రదాయాలను తిలకించారు. ఆదివాసీ పెద్దలను ఆప్యాయంగా పలకరించి, బాగోగులు తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment